Site icon vidhaatha

Gold Rate | సామాన్యులకు షాక్‌ ఇచ్చిన బంగారం, వెండి ధరలు..! నేడు మార్కెట్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate |

పుత్తడి, వెండి ధరలు సామాన్యులకు షాక్‌ ఇచ్చాయి. మార్కెట్‌లో బంగారం రేటు పెరిగింది. 22 గ్రాముల తులం బంగారంపై రూ.100 పెరిగి.. రూ.54,250 చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ.100 పెరిగి.. రూ.59,160 వద్ద కొనసాగుతున్నది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,400 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రేటు రూ.59,320కి పెరిగింది.

ముంబయిలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,160 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,560 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి రేటు రూ.54,250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,160 పలుకుతున్నది.

ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మార్కెట్‌లో వెండి ధరలు సైతం పెరిగాయి.

కిలో వెండిపై రూ.800 పెరిగి రూ.73వేలకు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి ప్రస్తుతం రూ.76,700 పలుకుతున్నది.

Exit mobile version