బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు స్వాగతం పలికిన మంత్రి జగదీశ్ రెడ్డి Suryapet | విధాత : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో గులాబీ దూకుడు కొనసాగుతున్నది. సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు బీఆరెస్లో చేరుతున్నారు. సూర్యాపేట రూరల్ మండలం కాసారబాధ్, సపావత్ తండాకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి, సూర్యాపేట […]
Suryapet | విధాత : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో గులాబీ దూకుడు కొనసాగుతున్నది. సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి, ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు బీఆరెస్లో చేరుతున్నారు. సూర్యాపేట రూరల్ మండలం కాసారబాధ్, సపావత్ తండాకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీని వీడి, సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
వలసల హోరు.. బీఆర్ఎస్ జోరు
గులాబీ గూటికి వలసల వెల్లువకాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన సూర్యాపేట రూరల్ మండలం కాసర బాధ, సపావత్ తండాకు చెందిన నేతలు కార్యకర్తలు.
గులాబీ కండువాతో సాదర స్వగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి. pic.twitter.com/zaUhVMGL3Q
— Jagadish Reddy G (@jagadishBRS) August 26, 2023
అభివృద్ధి కి మద్దతుగా వచ్చిన కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పిన మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆభివృద్ధిపై ఇతర రాష్ట్రల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలంగాణ హయాంలో జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలు తండాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేసీఆర్ కు మద్దతుగా ఊరు.. వాడ ఏకం కావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటిసి జీడి బిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఈదుల యాదగిరి, సంకరమద్ధి రమణా రెడ్డి, ఎంపిటిసి నాగమ్మ సైదులు, సర్పంచ్ రేణుక , నరేష్, లాలు నాయక్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.