హైదరాబాద్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్లోని తన సొంతింటికి వెళ్లారు. నందినగర్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీశ్రావు కూడా నందినగర్కు వెళ్లారు.
#WATCH | Former CM of Telangana and BRS party national leader KCR discharged from Yashoda Hospital in Hyderabad.
KCR underwent a total left hip replacement surgery after he fell in his farmhouse in Erravalli, on December 7. pic.twitter.com/12SgGpb2mu
— ANI (@ANI) December 15, 2023
తుంటి మార్పిడి శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ యశోద ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందిన సంగతి తెలిసిందే. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ తర్వాత కేసీఆర్ కోలుకోవడంతో.. వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో నాలుగైదు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 7వ తేదీన రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే.
దీంతో కేసీఆర్ను కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. 9వ తేదీన కేసీఆర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత కేసీఆర్ను వాకర్ సాయంతో వైద్యులు నడిపించారు. ఇక ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే.