కేంద్రంపై ట్విటర్లో KTR సెటైర్
విధాత: కేంద్రంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. సాధారణ ప్రజలు పాలు, పెరుగు పైనా జీఎస్టీ కట్టాలి. అదానీ లాంటి ప్రత్యేక వ్యక్తులు ఎయిర్పోర్టులు పొందినప్పటికీ జీఎస్టీ వర్తించబోదని కేటీఆర్ ఆక్షేపించారు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అదానీ గ్రూపునకు బదిలీ.. జీఎస్టీ వర్తించదన్న వార్తకథనాలపై మంత్రి ట్విటర్ ద్వారా స్పందించారు.
Ordinary Indians have to pay GST even on Milk & Curd
But extraordinary Indians like Adani, No GST even when you get an Airport on a platter with tailor made policies thanks to PRadani
And this ain’t Revdi/Freebie
It’s just “A Mitr Kaal”#FriendWithBenefits pic.twitter.com/janiIEW4a6
— KTR (@KTRBRS) April 24, 2023
సరిపడా విధానాలతో విమానశ్రయాలను పల్లెంలో వడ్డిస్తున్నారన్న కేటీఆర్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలా చేయడం ఉచితాలు కావన్న ఆయన ‘ఏ మిత్ర్ కాల్’ అని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ‘ ఇది అమృత్ కాల్ కాదు.. ఏ మిత్ర్ కాల్’ వ్యాఖ్యానించారు.