మావోయిస్టు నేత గిరిధర్ తుమ్రెట్టి దంపతుల లొంగుబాటు

మహారాష్ట్రలో మావోయిస్టు లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇంచార్జి మోస్ట్ వాంటెడ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు ఆదివారం డిప్యూటీ సీఎం, పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు.

  • Publish Date - June 23, 2024 / 05:37 PM IST

విధాత : మహారాష్ట్రలో మావోయిస్టు లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరౌలి జిల్లా మావోయిస్టు ఉద్యమ ఇంచార్జి మోస్ట్ వాంటెడ్ గిరిధర్ తుమ్రెట్టి అలియాస్ బిచ్చు ఆదివారం డిప్యూటీ సీఎం, పోలీస్ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. బిచ్చు భార్య సంగీత అలియాస్ లలిత కూడా లొంగి పోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో వారు లొంగిపోయారు.

బిచ్చు లొంగుబాటుతో గడ్చిరౌలి జిల్లాతో పాటు మధ్య భారత్‌లోని మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్ట యిందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గిరిధర్ తుమ్రెట్టి 86 ఎన్‌కౌంటర్లు, 15 కాల్పుల ఘటనలో క్రియాశీలక పాత్ర పోషించాడు. బిచ్చుపై 25 లక్షల రూపాయల రివార్డు ఉంది. అనేక ప్రభుత్వ వ్యతిరేక ఘటనలో పాల్గొన్నందుకు 179 కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు అనేక ఘటనల్లో వివిధ హోదాల్లో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడు.

 

Latest News