విధాత: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఆ తర్వాత జోగి రమేశ్తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేశ్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కాగా జోగి రమేశ్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారని అందు చేతనే తాను ఈ పనిలోకి దిగానని తెలిపాడు. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇబ్రహీంపట్నంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి సాయం తీసుకుని మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు

Latest News
విద్యార్ధుల ఆందోళనకు దిగిరాక తప్పని మోదీ అహంకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
సామేల్ విమర్శలు..వినాశకాలే విపరీత బుద్ది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
కేసీఆర్ ఆశీర్వచనం తీసుకున్న కేటీఆర్..వీడియో వైరల్
క్యూర్ లో జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!
కాక్రోచ్ లతో ముగిసిన కేంద్రం చర్చలు..ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్.!
ఐదవ రోజు ఉభయ సభలు మళ్లీ వాయిదా..!
పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్
అమెరికా రాజకీయాల్లో దూసుకొస్తున్న కొత్త నాయకత్వం?