విధాత: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఆ తర్వాత జోగి రమేశ్తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేశ్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కాగా జోగి రమేశ్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారని అందు చేతనే తాను ఈ పనిలోకి దిగానని తెలిపాడు. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇబ్రహీంపట్నంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి సాయం తీసుకుని మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు

Latest News
2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్..21 మంది మృతి
పర్యావరణ పరిరక్షలో సింగరేణి అద్బుతం !
స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన బాధకరం : మాజీ సీఎం జగన్
డీలిమిటేషన్పై బీజేపీ కొత్త వ్యూహం.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు, డీఎంకే మద్దతుకు యత్నాలు?
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
భర్తను నరుకుతూ భార్య సెల్ఫీలు..తర్వాత షాకింగ్ ట్విస్టులు !
ప్రతి ఏటా ఐదు లక్షల ఎకరాల్లో వరి తగ్గించాలని కేంద్రం హుకుం.. తెలంగాణ రైతుకు కొత్త తలనొప్పి
వరంగల్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇద్దరు మంత్రులు మిస్.. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
Raghava Lawrence | రాఘవ లారెన్స్ రాజకీయ ప్రకటన వాయిదా.. భారతీరాజా మరణానికి నివాళిగా కీలక నిర్ణయం