విధాత: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఆ తర్వాత జోగి రమేశ్తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేశ్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కాగా జోగి రమేశ్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారని అందు చేతనే తాను ఈ పనిలోకి దిగానని తెలిపాడు. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇబ్రహీంపట్నంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి సాయం తీసుకుని మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు

Latest News
అకీరా ఎంట్రీపై ఆసక్తి పెంచిన అడివి శేష్ వ్యాఖ్యలు…
12 గంటల చర్చలు సఫలం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ఏప్రిల్ 25 శక్తివంతమైనదే.. కానీ కవితకు కొంత సవాలే..!
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు..!
350cc ఇంజిన్తో డ్యూక్ బైక్లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!
8000mAh పవర్ఫుల్ బ్యాటరీతో రియల్మీ కొత్త మొబైల్.. రూ.15వేలలోనే ధర!
పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్
నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఎడ్యుకేషన్ హబ్లో వైరల్ వీడియో
బరువు తగ్గేందుకు వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న యూత్!
అంత్యక్రియల్లో ఆధిపత్య ‘రాజకీయమా’!? మృతుడు శంకర్ గౌడ్ కుటుంబం అవస్థలు