విధాత: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఆ తర్వాత జోగి రమేశ్తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేశ్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కాగా జోగి రమేశ్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారని అందు చేతనే తాను ఈ పనిలోకి దిగానని తెలిపాడు. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇబ్రహీంపట్నంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి సాయం తీసుకుని మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు

Latest News
రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తున్న దిశా పటాని
పాముల గురించి 16 ఆశ్చర్యకర నిజాలు! వీటిలో మీకెన్ని తెలుసు?
మేడారానికి ఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు
జిఎస్టి తరహాలో ఆదాయపు పన్ను స్లాబ్లు? కేంద్రం యోచన
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజం "గొల్ల రామవ్వ"
బెడ్ రూమ్ ఫొటోస్ తో గత్తర్ లేపిన కృతి శెట్టి
ఎయిర్ ఇండియాకు కోలుకోలేని దెబ్బ.. విమాన ప్రమాదం తర్వాత రూ.15 వేల కోట్ల నష్టం..!
ఆయుధాలు వదలకుంటే హమాస్కు అంతమే : ట్రంప్ వార్నింగ్
తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు
భారత్ లో జరిగే టీ 20వరల్డ్ కప్ ఆడం : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం