విధాత: నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఆ తర్వాత జోగి రమేశ్తోపాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు. రమేశ్ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కాగా జోగి రమేశ్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తనకు రూ.3 కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారని అందు చేతనే తాను ఈ పనిలోకి దిగానని తెలిపాడు. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఇబ్రహీంపట్నంలో
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి సాయం తీసుకుని మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు

Latest News
ఎమ్మెల్యే గాంధీకి గోపన్ పల్లి జర్నలిస్ట్ కాలనీ వాసుల వినతి
బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక 'దేవాలయ సర్క్యూట్' : కేబినెట్ సబ్ కమిటీ
పార్టీలో కొనసాగడంపై ఆలోచించే సమయం వచ్చింది: జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
లావణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట
కూతురు సుస్మితకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..
అసెంబ్లీ సమరానికి కాంగ్రెస్... బీఆర్ఎస్ సన్నాహాలు!
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు!
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..కొనసాగుతున్న చర్చ
టీ 20వరల్డ్ కప్ విజేత టీమిండియాకు బీసీసీఐ భారీ నజరాన!