టి20 ప్రపంచకప్( T20 CRICKET WORLD CUP 2024) ముగింపు దశకు చేరుకుంది. నేడు జరగాల్సిన రెండు సెమీస్లో ఒకదాన్లో దక్షిణాఫ్రికా, అఫ్ఘనిస్తాన్పై విరుచుకుపడి, సునాయాస విజయం(South Africa won over Afghanistan) సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక రెండోది, అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్–ఇంగ్లండ్( India vs England)ల మధ్య ఈ సాయంత్రం జరగాల్సింది. ఇందులో విజేత, 29వ తేదీన ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడతారు.
ఇప్పుడు ఈ మ్యాచ్కే వరుణుడు(Rain likely to washout) అడ్డుపడుతున్నాడు. మ్యాచ్ జరుగనున్న గయానా(Guyana)లో వర్షం పడుతూనేఉంది. అక్కడ ఈ మ్యాచ్ ఉదయం పూట జరుగుతోంది కాబట్టి, ఈ రోజంతా వర్షం పడే అవకాశం ఉందని గయానా వాతావరణ శాఖ, ప్రపంచ వాతావరణ వెబ్సైట్ ఆక్యూవెదర్.కామ్(Accuweather.com) తెలిపింది. సరిగ్గా మ్యాచ్ మొదలయ్యే సమయానికే వర్షం ఎక్కువవుతుందని వారు చెపుతున్నారు. గంటగంటకి వర్షానికి ఎంత శాతం అవకాశముందో చూడండి.
ఉ. 9 గం. ( సా. 6.30 IST) – 40 %
ఉ. 10 గం. (రా. 7.30 IST) – 66 %
ఉ. 11 గం. ( రా. 8.30 IST) – 75 %
మ. 12 గం. ( రా. 9.30 IST) – 49 %
మ. 1 గం. ( రా. 10.30 IST) – 34 %
మ. 2 గం. ( రా. 11.30 IST) – 34 %
మ. 3 గం. ( అరా. 12.30 IST) – 40 %
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి:
ఐసీసీ రెండు సెమీఫైనల్ మ్యాచ్లకు కలిపి ఒక రోజు రిజర్వ్ డే(Reserve Day)గా ఉంచింది. ఇండియా–ఇంగ్లండ్ మ్యాచ్కు మాత్రం ఉదయం పూట కాబట్టి, మ్యాచ్ పూర్తయ్యేందుకు దాదాపు 4 గంటల అదనపు సమయం (Extra 250 Minutes) కేటాయించింది. ఫలితం తేలాలంటే మాత్రం ఇరు జట్లు కనీసం 10 ఓవర్ల(Minimum 10 Overs) ఆటైనా ఆడాల్సిఉంటుంది. ఒకవేళ రెండు జట్లలో ఏ జట్టయినా, 10 ఓవర్లు పూర్తిగా ఆడలేకపోతే, మ్యాచ్ రద్దయినట్లు(Match will be abandoned)గా ప్రకటిస్తారు. అలా జరిగితే భారత్ ఫైనల్లో ప్రవేశిస్తుంది(India enters Final). ఎందుకంటే గ్రూప్ స్టేజ్లో భారత్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి. ఇంగ్లండ్ ఇంటిముఖం పడుతుంది. నిరుటి విజేత మళ్లీ గెలవాలంటే మ్యాచ్ జరగాలని ఇంగ్లండ్ దేవున్ని ప్రార్థించాలి.