విధాత, హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ బుధవారం తీవ్ర గందరగోళం మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లు చర్చ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలపై చేసిన విమర్శలపై బీఆరెస్ సభ్యులు నినాదాలతో నిరసనలు వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందినట్లుగా ప్రకటించాచి సభను గురువారం ఉదయం 10గంటలకు వాయిదా వేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగా, ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చ ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మరోసారి గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగడంతో కేటీఆర్ ప్రసంగానికి అధికార పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు పలువురు అడ్డు తగిలారు. కేటీఆర్తో సంవాదం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డిని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్ సభ్యులు నిరసనకు దిగడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. గందరగోళ పరిస్థితుల నడుమ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మళ్లీ తిరిగి సభ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రారంభమైంది. సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆరెస్ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లిన బీఆరెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారం నశించాలి అని నినాదాలు చేశారు. స్పీకర్ వినిపించుకోకుండా అధికార సభ్యుడు గడ్డం వివేక్కు అవకాశం ఇచ్చారు. బీఆరెస్ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సబితకు మైక్ ఇచ్చేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం.. చివరకు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండానే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదింపచేసింది. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనసభ నుంచి బీఆరెస్ సభ్యులు బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ధ మాట్లాడారు.
Telangana Assembly | గందరగోళం మధ్య ద్రవ్య వినియమ బిల్లుకు ఆమోదం..గురువారానికి సభ వాయిదా
తెలంగాణ శాసన సభ బుధవారం తీవ్ర గందరగోళం మధ్యనే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లు చర్చ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలపై చేసిన విమర్శలపై బీఆరెస్ సభ్యులు నినాదాలతో నిరసనలు వ్యక్తం

Latest News
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్