విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ రోజులను కుదించడం సరికాదని, సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని, ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. ప్రతిపక్షాల దాడి నుంచి తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తున్నారని ఆరోపించారు. డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే చర్చ పెట్టడం దారుణమన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని నిలదీశారు. మూడు, నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికమన్నారు. మేం 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లామని, అందులో ఒకటి, రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్, సాగు నీరు, ఉద్యోగాల ఖాళీలు, విద్యా రంగ సమస్యలు, ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తున్నదని విమర్శించారు.
Eleti Maheshwar Reddy | అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్రెడ్డికి జంకు … బీజేఎల్పీ నేత ఏలేటి ఫైర్
సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సమావేశాల నిర్వాహణ రోజులను కుదించడం సరికాదని, సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని, ప్రతిపక్షాల గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.

Latest News
పుట్టగొడుగుల సాగుతో.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న ఒడిశా రైతు
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ 33 ఫస్ట్ లుక్ రిలీజ్
అక్కడ కేఏ పాల్ లెవల్ వేరయా..!
2030 నాటికి దేశంలో గిగ్ వర్కర్లు 2 కోట్ల 35 లక్షలు..!
మన శంకర వర ప్రసాద్ గారి కలెక్షన్ల సునామీ : 5వ రోజునాటికి 150 కోట్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంపన్నుల చేతుల్లో ఆయుధం..!
ఎంతకాలం విచారించాలి: ఫోన్ టాపింగ్ కేసులో సుప్రీం కోర్టు అసహనం
నెట్ఫ్లిక్స్లో కొత్త సినిమాల పండగ..
ఓటీటీలో.. కృష్ణ బురుగుల ‘జిగ్రిస్’ సంచలనం
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు