విధాత, హైదరాబాద్ : రైతు భరోసా సహాయం పంపిణీకి ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఈ బడ్జెట్ లోనే రైతుభరోసాకు నిధులు కేటాయించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతుభరోసా విధివిధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, కమిటీ సభ్యులు భట్టి విక్రమార్కతో పాటు సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు హాజరయ్యారు. తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకీ పంచుతుందని స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశామని ఇచ్చి హామీని అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నామన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టిన రైతుబంధు నిధులను సమయానుకూలంగా తమ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నదని చెప్పారు. రైతు భరోసాపై రైతుల ఆలోచన ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటోందన్నారు. అందుకే రైతుల నుంచి వచ్చే ప్రతిసూచనను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
బడ్జెట్లో రైతు భరోసాకు నిధులు ప్రజాభిప్రాయసేకరణలో .. డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు తుమ్మల, పొంగులేటి
రైతు భరోసా సహాయం పంపిణీకి ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ఈ బడ్జెట్ లోనే రైతుభరోసాకు నిధులు కేటాయించబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

Latest News
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ
పర్యావరణ విధ్వంసం..గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు: రాహుల్ గాంధీ ట్వీట్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు