విధాత, హైదరాబాద్ : శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయగా, క్రస్ట్గేట్ల దిగువన మత్స్యకారులు చేపల వేట కోసం హడావుడి పడ్డారు. భారీ సంఖ్యలో పుట్టిలలో వచ్చిన మత్స్యకార్మికులు క్రస్టగేట్లకు దిగువన నది జలాల్లో చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. పుట్టిలతో గుంపులుగా వచ్చిన మత్స్యకార్మికులు చేపల పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత కొన్ని రోజులుగా కృష్ణానదిలో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా తరలివచ్చిన మత్స్యకార్మికులు చేపల వేటకు పోటీ పడ్డారు. డ్యాం దిగువన నది జలాల్లో 2నుంచి 5కిలోల వరకు చేపలు దొరుకుతుండటంతో పాటు సందర్శకుల నుంచి ఆ చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో మత్స్యకార్మికులు చేపల వేట కోసం భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు.
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ చెంత చేపల వేట హడావుడి.. పుట్టిలలో మత్స్యకారుల పోటాపోటీ
శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయగా, క్రస్ట్గేట్ల దిగువన మత్స్యకారులు చేపల వేట కోసం హడావుడి పడ్డారు. భారీ సంఖ్యలో పుట్టిలలో వచ్చిన మత్స్యకార్మికులు క్రస్టగేట్లకు దిగువన నది జలాల్లో చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు

Latest News
స్థిరంగా బంగారం…తగ్గిన వెండి ధరలు
‘నాన్న పిలుస్తున్నాడురా.. లేవరా..’ కొడుకు శవం వద్ద తండ్రి కన్నీరు.. గుండెలు పిండే వీడియో
ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు