విధాత, హైదరాబాద్ : శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయగా, క్రస్ట్గేట్ల దిగువన మత్స్యకారులు చేపల వేట కోసం హడావుడి పడ్డారు. భారీ సంఖ్యలో పుట్టిలలో వచ్చిన మత్స్యకార్మికులు క్రస్టగేట్లకు దిగువన నది జలాల్లో చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. పుట్టిలతో గుంపులుగా వచ్చిన మత్స్యకార్మికులు చేపల పడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత కొన్ని రోజులుగా కృష్ణానదిలో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా తరలివచ్చిన మత్స్యకార్మికులు చేపల వేటకు పోటీ పడ్డారు. డ్యాం దిగువన నది జలాల్లో 2నుంచి 5కిలోల వరకు చేపలు దొరుకుతుండటంతో పాటు సందర్శకుల నుంచి ఆ చేపలకు మంచి డిమాండ్ ఉండటంతో మత్స్యకార్మికులు చేపల వేట కోసం భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు.
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్ చెంత చేపల వేట హడావుడి.. పుట్టిలలో మత్స్యకారుల పోటాపోటీ
శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయగా, క్రస్ట్గేట్ల దిగువన మత్స్యకారులు చేపల వేట కోసం హడావుడి పడ్డారు. భారీ సంఖ్యలో పుట్టిలలో వచ్చిన మత్స్యకార్మికులు క్రస్టగేట్లకు దిగువన నది జలాల్లో చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు

Latest News
రేపే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన..పార్టీ పేరుపై సస్పెన్స్!
ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న చర్చలు..ఉత్కంఠ
కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది : ఎంపీ ఈటల రాజేందర్
ఆమె 2.06మీటర్లు..ఆయన 1.62మీటర్లు!
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం
మూడు దశాబ్దాల తర్వాత ‘నో కిస్సింగ్’ నియమాన్ని ఉల్లంఘించిన కాజోల్…
ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్న అల్లు అర్జున్ ..
అప్పులతోనే రాష్ట్రం మనుగడ : మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు