విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేసిన రెండు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్టు తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో కవిత తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై మే28న విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించింది. మహిళను అందులో తాను శాసనమండలి సభ్యురాలిగా ఉన్నందున తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా కవిత బెయిల్ ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత మూడున్నర నెలల నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత వేసిన రెండు బెయిల్ పిటీషన్లను హైకోర్టు తిరస్కరించింది. కవిత ఓ ప్రముఖ వ్యక్తి అని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, ఆమె ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ నుంచి కీలక నిందితురాలిగా ఉన్నారని దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ నిరాకరించింది.
కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు … బెయిల్ పిటిషన్ కొట్టివేత
బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేసిన రెండు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది

Latest News
ఏఐతో మీ చాట్లో ప్రైవసీ ఎంత? స్టాన్ఫోర్డ్ అధ్యయనంలో వెలుగులోకి షాకింగ్ అంశాలు..
తెలంగాణలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్ల రాబడి!
యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులు : మంత్రి ఉత్తమ్
ప్రాధాన్యత వారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు : మంత్రి ఎన్.ఉత్తమ్ వెల్లడి
దళపతి విజయ్ విడాకుల మేటర్..
రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!
రాజ్యసభ ఎన్నికల వేడి..అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
వెయ్యేళ్ల శిల్పం కిరీటం...కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!