విధాత, వరంగల్ ప్రతినిధి:ములుగు జిల్లా అటవీ సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు. బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి వీరస్వామి- రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా రెండవ కుమారుడైన అశోక్ స్థానికంగా 7వ తరగతి చదువుకున్నాడు. మొదట డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేసి అశోక్ కొంతకాలం తర్వాత జనశక్తి పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసిన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ లోకి చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అశోక్ తల్లి 20 సంవత్సరాల క్రితం చనిపోగా, తండ్రి గత సంవత్సరం మృతి చెందారు. అశోక్ కు ఇద్దరితో వివాహాలు కాగా ప్రస్తుతం వారు విడిపోయి వేరే ఉంటున్నారు. కాగా అశోక్ తండ్రి సంవత్సరికం రోజునే మావోయిస్టు నేతగా ఎదిగిన అశోక్ మృతి చెందడంతో బుద్దారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Encounter | ములుగు జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ మావోయిస్టు మృతి … బుద్ధారం లో విషాదం
ములుగు జిల్లా అటవీ సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి