విధాత, వరంగల్ ప్రతినిధి:ములుగు జిల్లా అటవీ సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు. బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి వీరస్వామి- రాజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కాగా రెండవ కుమారుడైన అశోక్ స్థానికంగా 7వ తరగతి చదువుకున్నాడు. మొదట డీసీఎం వ్యాన్ డ్రైవర్ గా పనిచేసి అశోక్ కొంతకాలం తర్వాత జనశక్తి పార్టీలో సానుభూతిపరుడిగా పనిచేసిన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ లోకి చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అశోక్ తల్లి 20 సంవత్సరాల క్రితం చనిపోగా, తండ్రి గత సంవత్సరం మృతి చెందారు. అశోక్ కు ఇద్దరితో వివాహాలు కాగా ప్రస్తుతం వారు విడిపోయి వేరే ఉంటున్నారు. కాగా అశోక్ తండ్రి సంవత్సరికం రోజునే మావోయిస్టు నేతగా ఎదిగిన అశోక్ మృతి చెందడంతో బుద్దారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Encounter | ములుగు జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్ మావోయిస్టు మృతి … బుద్ధారం లో విషాదం
ములుగు జిల్లా అటవీ సరిహద్దుల్లో గురువారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందాడు

Latest News
సెలబ్రిటీ పెళ్లిళ్ల సందడి..
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో డాక్టర్ గురవా రెడ్డి పోస్ట్ వైరల్..
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ..
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!