Telangana High Court | అనుమతి లేకపోతే కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు విచారించింది. శ్రీకృష్ణా జన్మష్టమిని పురస్కరించుకొని రథం ఊరేగింపు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి హైదరాబాద్ రామంతాపూర్ వద్ద ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్యుత్ స్థంభాలకు ఉన్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. అయితే దీనిపై ఎయిర్ టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించింది. అయితే ఏయే విద్యుత్ స్థంభాలకు అనుమతి తీసుకున్నారో చెప్పాలని విద్యుత్ శాఖ తరపు న్యాయవాది ఎయిర్ టెల్ సంస్థ న్యాయవాదిని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక విగ్రహాల తరలింపు సమయంలో కూడా ఇటీవల హైదరాబాద్ నగరంలో రెండు మూడు చోట్ల విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో నగరంలో విద్యుత్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ పెట్టారు.
Telangana High Court : అనుమతి లేకపోతే కేబుల్ వైర్లు తొలగించవచ్చు
తెలంగాణ హైకోర్టు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలంటూ ఆదేశం జారీ చేసింది, విద్యుత్ ప్రమాదాలను తగ్గించేందుకు.

Latest News
అందరూ అగమాగం – ఎవరు సక్కగున్నరు? : జగిత్యాలలో కేసీఆర్ ఫైర్
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ పేల్చిన ఢిల్లీ బాంబు
సోషల్ మీడియాలో అనసూయపై అసభ్యకర పోస్టులు..
మేడిగడ్డ పరీక్షల పూర్తికి మే నెలాఖరు డెడ్లైన్.. బరాజ్ను సందర్శించిన సీఎం రేవంత్..
త్వరలో భూముల విలువలు పెంపు...రిజిస్ట్రేషన్ ఛార్జీల మోత తప్పదా
పెద్దితో మాస్ స్టెప్పులు వేసే ఛాన్స్ దక్కించుకున్న సాయి ధరమ్ బ్యూటీ..
అంతర్జాతీయ రేసులో నటుడు అజిత్ బృందం మరో విజయం
పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. అవి వచ్చాకే నిర్వహణ..
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
లోకేశ్ ..నీది జగన్తో పోల్చుకునే స్థాయి కాదు : లక్ష్మీపార్వతి ఫైర్