Telangana High Court | అనుమతి లేకపోతే కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపుపై తెలంగాణ హైకోర్టు విచారించింది. శ్రీకృష్ణా జన్మష్టమిని పురస్కరించుకొని రథం ఊరేగింపు చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి హైదరాబాద్ రామంతాపూర్ వద్ద ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విద్యుత్ స్థంభాలకు ఉన్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. అయితే దీనిపై ఎయిర్ టెల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని ఆరోపించింది. అయితే ఏయే విద్యుత్ స్థంభాలకు అనుమతి తీసుకున్నారో చెప్పాలని విద్యుత్ శాఖ తరపు న్యాయవాది ఎయిర్ టెల్ సంస్థ న్యాయవాదిని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుళ్లను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక విగ్రహాల తరలింపు సమయంలో కూడా ఇటీవల హైదరాబాద్ నగరంలో రెండు మూడు చోట్ల విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో నగరంలో విద్యుత్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ పెట్టారు.
Telangana High Court : అనుమతి లేకపోతే కేబుల్ వైర్లు తొలగించవచ్చు
తెలంగాణ హైకోర్టు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించాలంటూ ఆదేశం జారీ చేసింది, విద్యుత్ ప్రమాదాలను తగ్గించేందుకు.

Latest News
Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత