విధాత: రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కు ఎంపిక అయ్యేలా చూడాలని ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచించారు.దేశంలోని పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై స్వచ్ఛ భారత్ కింద కేంద్రం సర్వే చేసింది.అందులో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కోసం 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే మన రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక అయ్యాయి అని వెల్లడించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యనారాయణ. తిరుపతి, విజయవాడ, విశాఖ […]
విధాత: రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ వాటర్ ప్లస్ సర్టిఫికేట్ కు ఎంపిక అయ్యేలా చూడాలని ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచించారు.దేశంలోని పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై స్వచ్ఛ భారత్ కింద కేంద్రం సర్వే చేసింది.అందులో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కోసం 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే మన రాష్ట్రం నుంచి 3 నగరాలు ఎంపిక అయ్యాయి అని వెల్లడించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సత్యనారాయణ.
తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలు ఈ సర్టిఫికెట్ కు ఎంపికయ్యాయి.అన్ని పట్టణాలను ఇలానే తీర్చి దిద్దే లా పని చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మొత్తం 2.60 లక్షలు Tidco ఇల్లు ఉన్నాయి…అన్ని త్వరగా ఇచ్చేస్తాం .Tidco ఇళ్ళ పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పస లేనివి.Tidco ఇళ్లను 6 నెలల్లో 80 వేలు..మరో 6 నెలల్లో మరో 80 వేలు…మిగిలినవి తర్వాత 6 నెలల్లో ఇస్తాం,ఇంటి నిర్మాణానికి డబ్బు సరిపోవడం లేదు అంటే ఇంతకు ముందు ఎంత ఇచ్చారో గుర్తు చేసుకోవాలి.విస్తీర్ణం లో చూసినా, డబ్బుల రూపం లో కూడా ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నాం
లోకేష్ వి అవగాహన లేని మాటలు,చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాల వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది.వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నాం .రాజధాని కేసులను రోజు వారీ విచారణ ను పిటిషనర్ లు మూడు నెలలు వాయిదా అడగడం వెనుక ఏం ఉద్దేశ్యాలు ఉన్నాయి,వాళ్లే కదా కేసు వేసింది..ఎందుకు వాయిదా అడిగారు..?అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలనే విధానానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు.