మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎంతంటే..

రాష్ట్రంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది. విధాత:రాష్ట్రంలో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్రపట్టనివ్వడం లేదు.రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల పెట్రోల్​ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటింది.తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది.ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ […]

మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎంతంటే..

రాష్ట్రంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది.

  • తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది.
  • గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.

విధాత:రాష్ట్రంలో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్రపట్టనివ్వడం లేదు.రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల పెట్రోల్​ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటింది.తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది.ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.96, డీజిల్‌ రూ.98.01 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.అలాగే విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.76, డీజిల్‌ రూ.97.91 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.22గా ఉంది.