సూర్యాపేట జిల్లాలో ఆటో – ఆర్టీసీ బస్సు ఢీ : ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం మోతె సమీపంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఆటో - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం మోతె సమీపంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆటో – ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 13 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూలీలు అని పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram