విధాత, హైదరాబాద్ : భారీ హెచ్చు తగ్గులతో కొనుగోలుదారులను గందరగోళానికి గురి చేస్తున్న బంగారం, వెండి ధరలు మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా స్థిరంగా నిలబడి ఊరట ఇచ్చాయి. ఆదివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 వద్ద, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,44,600 వద్ద కొనసాగుతున్నాయి.
నిలకడగా వెండి ధరలు
వెండి ధరలు కూడా ఆదివారం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 2,80,000వద్ద స్థిరంగా నిలిచింది. వెండి, బంగారం ధరలు నిలకడగా ఉండటంతో కొనుగోలుకు ఇదే సరైన సమయంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారులు సైతం ముందున్న శుభకార్యాలు..ధరలు అందుబాటులో ఉండటంతో బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపుతుండటంతో జ్యువెలరీ షాపులలో సందడి నెలకొంది.
