Actress| ఒకప్పుడు ఎంతో నాజూకుగా ఉండే అందాల భామలు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత గుర్తు పట్టకుండా మారిపోతున్నారు. ఒకప్పుడు తన గ్లామర్తో ఉర్రూతలూగించిన రక్షిత కుర్రాళ్ల కలల రాణిగా ఉండేది. ఆమెని చూసి యూత్ పిచ్చెక్కిపోయేవాళ్లు. రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో టాలీవుడ్ ఎం
Actress| ఒకప్పుడు ఎంతో నాజూకుగా ఉండే అందాల భామలు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత గుర్తు పట్టకుండా మారిపోతున్నారు. ఒకప్పుడు తన గ్లామర్తో ఉర్రూతలూగించిన రక్షిత కుర్రాళ్ల కలల రాణిగా ఉండేది. ఆమెని చూసి యూత్ పిచ్చెక్కిపోయేవాళ్లు. రవితేజ నటించిన ఇడియట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంలో అదరగొట్టింది. ఈ సినిమా కన్నా ముందు కన్నడలో అప్పు అనే చిత్రం చేయగా, ఈ మూవీనే రీమేక్ చేసి తెలుగులో ఇడియట్ చేశారు. రెండు చిత్రాలకి దర్శకుడు పూరీ జగన్నాథ్ కాగా, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ నటించారు, తెలుగులో రవితేజ నటించారు. హీరోయిన్గా మాత్రం రెండింట్లో రక్షితనే నటించింది.
రక్షిత నటించిన తొలి సినిమానే హిట్ కావడంతో మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు వంటి సినిమాలలో స్టార్ హీరోల పక్కన జత కట్టింది. కాని ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. దాంతో అమ్మడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రక్షిత చివరిగా 2005లో జగపతి సినిమా చేసింది. ఆ తర్వాత కన్నడలోనే సినిమాలు చేస్తూ అక్కడి డైరెక్టర్ని వివాహం చేసుకుంది. 2007లో రక్షిత పెళ్లి కాగా,అప్పటి నుండి సినిమాలు చేయడం మానేసింది. కాకపోతే నిర్మాత అవతారం ఎత్తింది. జోగయ్య, డీకే, ఏక్ లవ్ యా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. పలు కన్నడ టీవీ షోస్ కి హోస్ట్ గా, జడ్జిగా కూడా వ్యవహరించింది.
రక్షిత ఎందుకో ఇటీవల చాలా బొద్దుగా మారింది. నాజూకుగా, అందంగా ఉండే రక్షిత అలా మారడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇలా అయిపోయిందని ఫ్యాన్స్ కూడా ఆలోచనలో పడ్డారు. ఇక రక్షిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి ముచ్చట చెప్పింది. మావయ్యలే పెళ్ళికూతుర్ని మండపానికి తీసుకొచ్చే సంప్రదాయం కొన్ని చోట్ల ఉండగా, తన మావయ్య కూడా మండపానికి తీసుకెళ్లాల్సి ఉంది. అయితే ఆయన ఏదో పని మీద బయటకి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు మండపం లోపలకు రానివ్వలేదు.. మా మావయ్య అనుమతించండి అని చెప్పినా కూడా రానివ్వలేదు. చివరికి ఎలాగోలా లోపలికి వచ్చి పెళ్లి తంతు పూర్తి చేశాడని పేర్కొంది