తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ కామెడీ షో జబర్ధస్త్. ఈ షోలో కామెడీ స్కిట్లు చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరిస్తున్నారు చాలా మంది కమెడీయన్స్. ఈ షోలో పాల్గొన్న ప్రతీ కమెడియన్ కు మంచి పేరు రావడం కాదు విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు.బుల్లితెరపై తెగ సందడి చేసే ఇతను ఆ మధ్య అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు ఈయన భార్య ఇతడి వెంటనే ఉంటూ విపరీతమైన సేవలు చేసింది. పంచ్ ప్రసాద్ ని కంటికి రెప్పలా చూసుకుంది. అయితే ఆమె తన అభిమాని అంటే పంచ్ ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు ఆమె తనని ఛీ కొడుతుందని వివరించారు. అయితే ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకున్న ఈమె ఈయనను ఎందుకు ఛీ కొడుతుందో అని అందరు షాక్ అవుతున్నారు.
పంచ్ ప్రసాద్ భార్య పేరు సునీత తన పంచ్ లను ఇష్టపడేదని ఇప్పుడు మాత్రం నేను వేసే పంచ్ లను ఛీ కొడుతోందని తాజాగా చెప్పుకొచ్చాడు పంచ్ ప్రసాద్. అనేక అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధ పడిన పంచ్ ప్రసాద్ చావు అంచుల వరకూ వెళ్లి వచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయట పడిన ఈయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉండగా, తన భార్య పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతుందని వివరించాడు. తనకు ఎవరైనా అవకాశం ఇస్తే.. తాను ఇప్పుడే చేసేందుకు రెడీగా ఉన్నానని గతంలో కన్నా ఉత్సాహంతో ఇప్పుడు షోస్ చేయాలని అనుకుంటున్నానని తాను చెప్పాడు.
పంచ్ ప్రసాద్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన కో కంటెస్టెంట్ నూకరాజు ఎంతో సాయం చేశాడు. పలువురు జబర్ధస్త్ కమెడీయన్స్ కూడా ఆయనకి అండగా నిలిచారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి వేణుస్వామి లక్ష రూపాయల సహాయం చేసిన సంగతి తెలిసిందే. తనదైన కామెడీతో హాస్యం పండించే పంచ్ ప్రసాద్ తిరిగి ఫామ్లోకి రావాలని పాత ఉత్సాహంతో షోస్, సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన ఆయన ఆపరేషన్ చేయించుకుని, ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మెరిసి తనదైన శైలిలో వినోదం పంచాడు.