Spiritual | చేతి నిండా డబ్బు ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే చేజారిపోతోంది. ఏదో రకంగా ఆర్థిక కష్టాల పాలవుతుంటాం. అప్పులు చేస్తూనే ఉంటాం. అంటే చేతికొచ్చిన చేతిలో ఎక్కువ కాలం నిల్వదు. ఇలా దరిద్రంతో బాధపడుతున్న వారు బుధవారం రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, దరిద్రం తొలగిపోయి ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఇక బుధవారం వేకువజామునే మేల్కొనాలి. అభ్యంగన స్నానం చేయాలి. పరిశుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో ఉన్న పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం గణపతికి పూజా చేయాలి. అయితే ఆర్థిక కష్టాలతో బాధపడేవారు మాత్రం 21 లేదా 42 జాపత్రి ఆకులతో గణనాథుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దరిద్రం పారిపోతుందని పండితులు చెబుతున్నారు. చేతి నిండా డబ్బు ఉంటుందని చెబుతున్నారు.
దీంతో పాటు బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డి మేతగా వేయడం వల్ల జాతకంలోని దోషాలు నశించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. అనుకున్న పనుల్లో పురోగతి సాధించి, ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు అని చెబుతున్నారు.
ఇక ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేసి, చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారు బుధవారం రోజున పెసలను ఉడికించి అందులో కాస్త పంచదార, నెయ్యి వేసి ఆవులకు తినిపిస్తే మంచి జరుగుతుందని, ఇలా క్రమం తప్పకుండా ఐదు నుండి ఏడు వారాల పాటు చేయడం వల్ల అప్పుల నుండి విముక్తి లభిస్తుందని, ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనవంతులు అవుతారు అని చెబుతున్నారు.
వాస్తు దోషాలు వల్ల కొన్నిసార్లు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక ఇటువంటి సమయంలో ఇంటి వెలుపల ఇంటిలోపల గణపతి విగ్రహాలను పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగి పోతాయి. ఆ గణపతి విగ్రహాలను రెండింటినీ ఒక దానికొకటి వెనకభాగం కలిసి ఉండేలా ముఖ ద్వారం దగ్గర ఏర్పాటు చేస్తే వాస్తు దోషాలు తొలగిపోయి మేలు జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.