ప్రతి నెల మహిళలకు పీరియడ్స్ రావడం సహజం. పీరియడ్స్ సమయంలో పూజలకు, శుభకార్యాలకు దూరంగా ఉండాలని అనేక పురణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్త్రీలు అసౌకర్యంగా కూడా ఉంటారు. అలసటతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి స్త్రీలు ఇబ్బంది పడకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు పవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండాలని పెద్దలు కూడా చెబుతుంటారు.
ప్రతి నెల మహిళలకు పీరియడ్స్ రావడం సహజం. పీరియడ్స్ సమయంలో పూజలకు, శుభకార్యాలకు దూరంగా ఉండాలని అనేక పురణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్త్రీలు అసౌకర్యంగా కూడా ఉంటారు. అలసటతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి స్త్రీలు ఇబ్బంది పడకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు పవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండాలని పెద్దలు కూడా చెబుతుంటారు. అయితే పీరియడ్స్ సమయంలో తులసి మొక్కకు నీరు పోయొచ్చా..? లేదా తెలుసుకుందాం.
స్త్రీలు రుతుక్రమంలో తులసిలో నీరు పోస్తే తులసి మొక్క ఎండిపోతుందని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో స్త్రీల శరీరంలో శక్తి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని దేవుడు సైతం సహించలేడు. అందువల్ల, పీరియడ్స్ సమయంలో పూజలు చేయడం లేదా ఆలయానికి వెళ్లడం నిషేధించబడింది.
రుతుస్రావం ఉన్న మహిళలు పూజ గదికి, వంటగదికి దూరంగా ఉండాలి. ప్రార్థన చేయడం, పవిత్ర గ్రంథాలను తాకడం వంటి పనులకు దూరంగా ఉండాలి. అలాగే ఆలయాల్లోకి కూడా ప్రవేశం లేదు. మీ పీరియడ్స్ 5వ రోజున, మీరు తల స్నానం చేయవచ్చు. అప్పటి నుంచి పూజ చేయవచ్చు. చాలామంది మహిళలకు 7 రోజుల వరకు పీరియడ్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో కూడా, మీరు 5వ రోజు తల స్నానం చేయొచ్చు. పూజలో పాల్గొనవచ్చు.
ఏదైనా ఉపవాస సమయంలో మీకు పీరియడ్స్ వస్తే, అటువంటి పరిస్థితిలో ఉపవాసం అసంపూర్తిగా ఉండకండి. మీ పూజను మరొకరి ద్వారా కూడా చేయించవచ్చు. దీనితో మీరు ఉపవాసం పూర్తి ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ సమయంలో పూజ సామగ్రిని తాకకూడదు. మీరు మీ మనస్సులో మంత్రాలను జపించవచ్చు.