విధాత : థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో 8మంది దుర్మరణం చెందారు.నగరంలోని మక్కసన్ ఎయిర్పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో నిండిన ఓ బస్సు రైల్వే క్రాసింగ్ సిగ్నల్ వద్ద సరిగ్గా రైల్వే పట్టాల మీదే ఆగిపోయింది. అదే సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు బస్సుని ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. రైలు ఢీకొట్టగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు.
మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ బస్సులో ప్రయాణిస్తున్నవారే. సమీపంలోని కొందరు బైక్ రైడర్లు గాయాలపాలయ్యారు. బస్సుకి అవతల వైపు ఆగి ఉన్న వాహనాలు కూడా ఈ ఘటనలో డ్యామేజ్ కావడం గమనార్హం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
속보🇹🇭태국 방콕 열차 사고
8명 사망, 30명 부상.
(부상자 중 2명은 중태)사망자중 30대 한국인 남성도 포함. pic.twitter.com/Aqqx0whI95
— rrace🇰🇷 (@junssi1982) May 17, 2026
