యూఎన్ఎస్సీ లో భారత్ కి శాశ్వత సభ్యత్వం..!
విధాత: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్ఎస్సీ) భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ అంశంలో భారత్కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. అత్యద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తున్న భారత్ను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో (ఎన్ఎస్జీ)లో చేర్చాలని అన్నారు. వైట్హౌస్లో అధ్యక్షుడు బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన […]

విధాత: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్ఎస్సీ) భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ అంశంలో భారత్కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. అత్యద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తున్న భారత్ను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో (ఎన్ఎస్జీ)లో చేర్చాలని అన్నారు. వైట్హౌస్లో అధ్యక్షుడు బైడెన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మండలిలో సంస్కరణలు అమలు చేసినప్పుడు భారత్ శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతునిస్తామని బైడెన్ స్పష్టం చేశారు.