పానగల్ ఆలయాల టూరిజం సర్కిల్కు రూ.123 కోట్లు: MLA కంచర్ల
మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష 17న సాయంత్రం నగరోత్సవం నిర్వహించాలని నిర్ణయం.. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం.. విధాత: పానగల్ సోమేశ్వరాలయాల టూరిజం సర్కిల్ అభివృద్ధిని రూ.123 కోట్లతో చేయనున్నట్టు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. టూరిజం సర్కిల్లో భాగంగా ఉదయ సముద్రం, ట్యాంక్ బండ్, పచ్చల, ఛాయా సోమేశ్వర, వేంకటేశ్వర ఆలయాల అభివృద్ధి, మ్యూజియం అభివృద్ధి, శిల్పారామం, మ్యూజియం, తీగల వంతెనల నిర్మాణాలతో ఈ ప్రాంతమంతా పర్యాటక దర్శనీయ కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందని అన్నారు. […]

- మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష
- 17న సాయంత్రం నగరోత్సవం నిర్వహించాలని నిర్ణయం..
- భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశం..
విధాత: పానగల్ సోమేశ్వరాలయాల టూరిజం సర్కిల్ అభివృద్ధిని రూ.123 కోట్లతో చేయనున్నట్టు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. టూరిజం సర్కిల్లో భాగంగా ఉదయ సముద్రం, ట్యాంక్ బండ్, పచ్చల, ఛాయా సోమేశ్వర, వేంకటేశ్వర ఆలయాల అభివృద్ధి, మ్యూజియం అభివృద్ధి, శిల్పారామం, మ్యూజియం, తీగల వంతెనల నిర్మాణాలతో ఈ ప్రాంతమంతా పర్యాటక దర్శనీయ కేంద్రంగా రూపుదిద్దుకోబోతుందని అన్నారు.
రానున్న రోజుల్లో ఛాయా సోమేశ్వరాలయం పూర్వ వైభవం సంతరించుకోనుందని కంచర్ల తెలిపారు. మంగళవారం పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఛాయా సోమేశ్వరాలయానికి రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతుందని అందుకు తగిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని… ముఖ్యంగా బారీకేడులు, శానిటరింగ్, ట్రాఫిక్ అదుపు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై ఎవరికి వారు శాఖల వారీగా బాధ్యతలు తీసుకొని, నిబద్ధతతో తమకు కేటాయించిన పనిని పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సంవత్సరం నుంచి.. పచ్చల, ఛాయా సోమేశ్వర నగరోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు.
అందుకు ఈనెల 17వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి రామగిరి రామాలయం నుంచి ఛాయా సోమేశ్వరాలయం వరకు వివిధ కళా రీతులను ప్రదర్శిస్తూ… బ్రహ్మాండంగా నగరోత్సవాన్ని నిర్వహించాలని మున్సిపల్ కమిషనరర్ను ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు తానే స్వయంగా భరిస్తానని తెలియచేశారు.
సమావేశంలో.. నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కేవీ రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్, ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సింగిల్ విండో చైర్మన్ నాగరత్నం రాజు, కౌన్సిలర్లు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, గోగుల శ్రీనివాస్ యాదవ్, ఊట్కూరు వెంకటరెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్, యామా దయాకర్, పున్నా గణేష్, మారగోని గణేష్, నాయకులు బకరం వెంకన్న, భువనగిరి దేవేందర్, సంధినేని జనార్దన్ రావు, సూర మహేష్, చెన్నుగూడెం సర్పంచ్ జంగయ్య, భక్తులు పాల్గొన్నారు