PM Ujjwala మూడు సంవత్సరాల్లో విడతలుగా అందజేత మూడో దఫా ఈ కోర్టుల ప్రాజెక్టుకు ఆమోదం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.. వెల్లడించిన ఠాకూర్ న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు కొత్తగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ 75 లక్షల కనెక్షన్లను 1,650 కోట్ల రూపాయలతో మూడు విడుతలుగా అందజేస్తారని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి […]
PM Ujjwala
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు కొత్తగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది.
ఈ 75 లక్షల కనెక్షన్లను 1,650 కోట్ల రూపాయలతో మూడు విడుతలుగా అందజేస్తారని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాబోయే నాలుగేళ్లలో 7,210 కోట్లతో అమలు చేసే ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్ ఫేజ్ 3ని కేంద్రం ఆమోదించిందని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జీ20 సదస్సును విజయవంతం చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పారు