మతాల మధ్య వైషమ్యాలను తొలగించి విశ్వశాంతి స్థాపన లక్ష్యంగా ప్రపంచంలో మరో కొత్త మతం అవిర్భవించింది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ‘అబ్రహామిక్’ అనే కొత్త మతాన్ని ఏర్పాటు చేశారు
విధాత, హైదరాబాద్: మతాల మధ్య వైషమ్యాలను తొలగించి విశ్వశాంతి స్థాపన లక్ష్యంగా ప్రపంచంలో మరో కొత్త మతం అవిర్భవించింది. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం కలయికతో ‘అబ్రహామిక్’ అనే కొత్త మతాన్ని ఏర్పాటు చేశారు. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లో అబ్రహంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు.
గతంలో 2020లో యూఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ దేశాలు మతాల మధ్య బేధాలను తొలగించి ప్రపంచ శాంతి స్థాపనకే అబ్రహామిక్ మతాన్ని ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతో ఈ ఒప్పందం ఏర్పాటైంది. ట్రంప్ దీనిని ‘అబ్రహామియన్ ఒప్పందం’గా అభివర్ణించారు. అబ్రహామిక్ మతం ఏర్పాటుతో ప్రపంచంలో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న 4,200కు పైగా మతాల జాబితాలో మరో కొత్త మతం చేరినట్లయ్యింది.