Chandrababu | విధాత, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పాలనలో విధ్వంసకర పాలన సాగుతుందని, తీవ్రమైన అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని , రాష్ట్రంలోని విపరీత పరిస్థితులను కట్టడి చేసేందుకు మీరు జోక్యం చేసుకోవాలంటు టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాశారు. తనపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. తన తొమ్మిది పేజీల లేఖకు 75పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కూడా జత చేసి పంపిన చంద్రబాబు వాటిలో వైసీపీ పాలనపై […]
Chandrababu |
విధాత, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ పాలనలో విధ్వంసకర పాలన సాగుతుందని, తీవ్రమైన అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని , రాష్ట్రంలోని విపరీత పరిస్థితులను కట్టడి చేసేందుకు మీరు జోక్యం చేసుకోవాలంటు టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాశారు. తనపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
తన తొమ్మిది పేజీల లేఖకు 75పేజీల అనుబంధ డాక్యుమెంట్లను కూడా జత చేసి పంపిన చంద్రబాబు వాటిలో వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని విధ్వంసం, ప్రజావేదిక కూల్చివేత, న్యాయమూర్తులు, కోర్టులపై సోషల్ మీడియా వేదికగా దాడులు, ఎస్ఈసీ, ఏపీపీఎస్సీ చైర్మన్లపై వేధింపులు, దేవాలయాలపై దాడులు జరిగాయని లేఖలో పేర్కోన్నారు.
నిరక్షరాస్యులను సైతం పట్టభద్రులుగా నమోదు చేసి దొంగ ఓట్ల రాజకీయాలకు పాల్పడ్డారని, గంజాయి అమ్మకాలు, మహిళలపైన, దళిత, గిరిజన మైనార్టీ, బలహీన వర్గాలపై దాడులు, అక్రమ కేసులు పెరిగాయన్నారు. మీడియాపై దాడులు వంటి నిరంకుశ, అరాచక విధానాలతో శాంతిభద్రతలను, రాజ్యంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వం శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను భయపెడుతుందన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశాయని, నాపైనే హత్యాయత్నం చేసి నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారని చంద్రబాబు తన లేఖలో పేర్కోన్నారు. ప్రభుత్వం ప్రోత్సహంతో తనపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని లేఖలో కోరారు.