Nagarkurnool| ఆ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢంగా లవ్ చేసుకున్నారు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం వేరే సంబంధాలు చూస్తున్నారు. ఆమెకేమో ఇష్టం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె ప్రియుడిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి చంపాడు. ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మాచారం గ్రామానికి […]
Nagarkurnool| ఆ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత గాఢంగా లవ్ చేసుకున్నారు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం వేరే సంబంధాలు చూస్తున్నారు. ఆమెకేమో ఇష్టం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె ప్రియుడిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి చంపాడు. ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మాచారం గ్రామానికి చెందిన దాసరి లింగస్వామి(24) అచ్చంపేట ఆశ్రమ పాఠశాలలో వర్కర్గా పని చేస్తున్నాడు. అయితే అమ్రాబాద్ మండలానికి చెందిన ఓ అమ్మాయిని లింగస్వామి గత కొన్నేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. ఆమె గద్వాలలో ఐటీడీఏ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. శుక్రవారం రోజు ప్రియురాలిని గద్వాల నుంచి అచ్చంపేటకు తన బైక్పై తీసుకొచ్చాడు లింగస్వామి. అచ్చంపేట బస్టాండ్లో ప్రియురాలిని వదిలేసిన లింగస్వామి తన సొంతూరు మాచారం బయల్దేరాడు. ఇంటికి చేరుకునే సరికి రాత్రి 10 అయింది.
అయితే లింగస్వామిని అచ్చంపేట నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్పై ఫాలో అయ్యాడు. లింగస్వామి ఇంటి వద్ద బైక్ ఆపగానే.. వెనుకాలే వచ్చిన ఆ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. 35 సార్లు కత్తితో పొడిచాడు. ఆ బాధ భరించలేక విలవిలలాడిపోయిన లింగస్వామి గట్టిగా కేకలు వేశాడు. దీంతో పొరుగింట్లో ఉన్న ఓ యువకుడు బయటకు వచ్చాడు. అతన్ని చూసి ఆ వ్యక్తి పారిపోయాడు.
రక్తపు మడుగులో పడిపోయి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. గ్రామస్తులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది.. లింగస్వామిని పరిశీలించగా, అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే లింగస్వామి ప్రియురాలికి ఇటీవలే పెళ్లి చూపులు జరిగాయి. ఆమెకు అతడు నచ్చలేదు. పెళ్లి చేసుకోనని చెప్పింది. అయినప్పటికీ తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని, వాట్సాప్ మేసేజ్లు చేస్తున్నాడని లింగస్వామికి ఆమె చెప్పింది. అతన్ని లింగస్వామి హెచ్చరించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో లింగస్వామి దారుణ హత్యకు గురయ్యాడు.