Hyderabad | హైదరాబాద్ నగరంలోని మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఎర్రం అనురాధ రెడ్డి(55) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనురాధను హత్య చేసిన నిందితుడు బీ చంద్రమోహన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అనురాధతో 15 ఏండ్లుగా సాగిన సహజీవనానికి గుర్తుగా నిందితుడు ఆమె శరీరంపై 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు విచారణలో తేలింది. అయితే వృత్తిరీత్యా నర్సు అయిన అనురాధ రెడ్డికి చంద్రమోహన్తో […]
Hyderabad |
హైదరాబాద్ నగరంలోని మలక్పేట పోలీసు స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఎర్రం అనురాధ రెడ్డి(55) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనురాధను హత్య చేసిన నిందితుడు బీ చంద్రమోహన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అనురాధతో 15 ఏండ్లుగా సాగిన సహజీవనానికి గుర్తుగా నిందితుడు ఆమె శరీరంపై 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు విచారణలో తేలింది.
అయితే వృత్తిరీత్యా నర్సు అయిన అనురాధ రెడ్డికి చంద్రమోహన్తో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారి తీసింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరువురి మధ్య గత కొన్నాళ్ల నుంచి విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో అనురాధ మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. తమిళ మ్యాట్రీమోనీలో ప్రకటన కూడా ఇచ్చింది. అయితే తనకు ఇవ్వాల్సిన రూ. 17 లక్షల నగదు, 2 కిలోలకు పైగా బంగారం ఇవ్వాలని అనురాధ చంద్రమోహన్ను డిమాండ్ చేసింది.
దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చంద్రమోహన్.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనురాధను మట్టుబెడితే నగదు, బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించి, ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.
ఈ నెల 12వ తేదీన ఆమెను 15 సార్లు కత్తితో పొడిచి చంపి, శవాన్ని ఒకరోజు ఇంట్లోనే ఉంచాడు. చంద్రమోహన్ ఇంటి పక్కనే ఉన్నవారు ఊరెళ్లిన తర్వాత.. స్టోన్ కట్టర్లు తెరిచి శరీరాన్ని ఆరు ముక్కలుగా చేశాడు. తలను వేరు చేశాడు.
మిగతా శరీర భాగాలను ఫ్రిజ్లో ఉంచి, తలను మలక్పేట పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నలుపు రంగు కవర్లో పెట్టి వదిలేశాడు. ఈ తల ఆధారంగా అనురాధ హత్య వెలుగు చూసింది.