Accident నలుగురు మృతి, పలువురికి గాయాలు విధాత: అల్లూరి జిల్లా పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Accident
విధాత: అల్లూరి జిల్లా పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.