విధాత: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల చేసింది. గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. గత ఏడాది మాదకద్రవ్యాలపై ఎన్సీబీ నివేదికను వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 26% గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గంజాయి సరఫరాలో రెండో స్థానంలో ఒడిస్సా […]
విధాత: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదిక విడుదల చేసింది. గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది. గత ఏడాది మాదకద్రవ్యాలపై ఎన్సీబీ నివేదికను వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 26% గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక గంజాయి సరఫరాలో రెండో స్థానంలో ఒడిస్సా ఉంది. 50 శాతానికి పైగా ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచే గంజాయి సాగవుతోంది. గత ఏడాది ఏపీలో 18 కిలోల హాశిష్ ఆయిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాపై 1775 కేసులు నమోదయ్యాయి. ఏపీలో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హెరాయిన్ కేసుల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 7,618 కిలోల హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. అత్యధికంగా గుజరాత్లో 3,334 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హెరాయిన్ కేసుల్లో రెండో స్థానంలో యూపీ ఉంది. యూపీలో 1,337 కిలోల హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. గత ఏడాది తెలంగాణలో 3,5270 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ నివేదిక ప్రకారం మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.