క్షేత్ర స్థాయిలో శానిటేషన్ పరిశీలన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలో అవలంబిస్తున్న సానిటేషన్ విధానాల అధ్యయనానికి బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన మేయర్లు ,ప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం బల్దియా పరిధి లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరేశీలించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లిలో గల పబ్లిక్ టాయిలెట్స్ ని క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిడబ్ల్యూ ఎంసీలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి ఈ సందర్భంగా ఆస్కీ ప్రతినిధి రాజమోహన్ […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలో అవలంబిస్తున్న సానిటేషన్ విధానాల అధ్యయనానికి బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు చెందిన మేయర్లు ,ప్రతినిధులు, అధికారుల బృందం బుధవారం బల్దియా పరిధి లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరేశీలించారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లిలో గల పబ్లిక్ టాయిలెట్స్ ని క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిడబ్ల్యూ ఎంసీలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి ఈ సందర్భంగా ఆస్కీ ప్రతినిధి రాజమోహన్ వారికి వివరించారు.
నగరానికి చెందిన సివిల్ సొసైటీ సభ్యుల బృందం బంగ్లాదేశ్, నేపాల్ ప్రతినిధులను కలిసి బల్దియాలో కొనసాగుతున్న పారిశుధ్య విధానాలపై చర్చించారు. స్థానికుల జీవన స్థితి గతులను, సేవలను అడిగి తెలుసుకున్నారు. జిడబ్ల్యూ ఎంసీలో అవలంబిస్తున్న ఉత్తమ, అధునాతన విధానాలను తమ దేశంలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నగరాల్లో అమలు చేస్తామని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో లలిత్ పూర్ మేయర్ రాజు మహాజన్, గోదావరి మున్సిపాలిటీ మేయర్ గజేంద్ర మహాజన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ సప్లై అండ్ సీవేజీ జాయింట్ సెక్రెటరీ కమల్ సఫ్కోట, ఫెడరల్ వాటర్ సప్లై అండ్ సీవేజి మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర కుమార్ ఝా, లలిత్ పూర్ మున్సిపాలిటీ ఇంజనీర్ బిబేక్ న్యూపనే, గోదావరి మున్సిపాలిటీ వార్డు చైర్పర్సన్లు నిల్ బహదూర్ దేశర్, గురంతారు, లహన్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ రామ్ చలితర్ మహతో, వాటర్ ఎయిడ్ నేపాల్ పి.ఎం. ఈ.ఆర్. రిచా కొయిరాలా,వాటర్ ఎయిడ్ నేపాల్ సీనియర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుశిరీనా మనందర్, డిప్యూటీ సెక్రటరీ లోకల్ గవర్నమెంట్ డివిజన్ ఫర్జానా మనాన్, మున్సిపల్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ దివాన్ కమల్ అహ్మద్, మునిసిపల్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ సీఈవో పరిమల్ కుమార్ దేయి, చట్టం చట్టోగ్రం కార్పొరేషన్ సిటీ ప్లానర్ అబ్దుల్లా అల్ ఒమర్, రాజ్ షాహి సిటీ కార్పొరేషన్ చీఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ అజీజూర్ రహమాన్, అర్బన్ సానిటేషన్ సర్వీసెస్ వాటర్ ఎయిడ్ బంగ్లాదేశ్ మేనేజర్ జహీదుల్ ఇస్లాంతో పాటు ఆస్కీ ప్రతినిదులు రాజమోహన్, అవినాష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.