TDP | విధాత: తెలుగుదేశంలోని ఇద్దరు ఎంపీల తీరు కాస్త తిరకాసుగా ఉంటోంది. పులుసు వేరు.. పులుసులోని ముక్కవేరు అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కొన్నిసందర్భాలలో అసలు పార్టీకి తమకు ఏమీ సంబంధం లేనట్లు.. పార్టీలో ఏమి జరుగుతుందో తమకు తేలేదు అన్నట్లు.. పార్టీ వ్యవహారాలు తమకు అవసరం లేనట్లు వ్యవహరిస్తున్నారు. మళ్ళీ అంతలోనే పార్టీ వ్యవహారాలు మొత్తం తామే నడుపుతున్నట్లు హడావుడి చేస్తున్నారు.. వీళ్ళ తీరు చూసి పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. గుంటూరు ఎంపీ గల్లా […]
TDP |
విధాత: తెలుగుదేశంలోని ఇద్దరు ఎంపీల తీరు కాస్త తిరకాసుగా ఉంటోంది. పులుసు వేరు.. పులుసులోని ముక్కవేరు అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కొన్నిసందర్భాలలో అసలు పార్టీకి తమకు ఏమీ సంబంధం లేనట్లు.. పార్టీలో ఏమి జరుగుతుందో తమకు తేలేదు అన్నట్లు.. పార్టీ వ్యవహారాలు తమకు అవసరం లేనట్లు వ్యవహరిస్తున్నారు. మళ్ళీ అంతలోనే పార్టీ వ్యవహారాలు మొత్తం తామే నడుపుతున్నట్లు హడావుడి చేస్తున్నారు.. వీళ్ళ తీరు చూసి పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళు ఆయా జిల్లాల్లో ఉండకుండా తప్పించుకుని ఎటెటో వెళ్లిపోయారు. అసలు వారి దృష్టిలో లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర పనికిమాలింది అన్నట్లుగా కనిపించింది. దానిగురించి ఎక్కడా ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు, స్వాగత తోరణాలు కట్టలేదు. దీంతో వాళ్ళు పార్టీ మారుతున్నారేమో అన్నట్లుగా అనిపించింది.
ఇదిలా ఉండగా వాళ్లిద్దరూ ఈరోజు ఢిల్లీలో చంద్రబాబు వెంట కనిపించరు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు చాలావరకు తొలగించేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ చంద్రబాబు తదితరులు ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఈ తరుణంలో చంద్రబాబు వెంట గల్లా, కేశినేని ఇద్దరూ ఉన్నారు.
ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ఆద్యంతం వాళ్ళీ పర్యవేక్షించారు. దగ్గరుండి ఏర్పాట్లు చేసారు. తీరా వాళ్ళు ఏపీ వచ్చేసరికి లోకేష్ ను పూచికపుల్ల మాదిరి తీసి పక్కన పడేస్తున్నారు. అంటే వాళ్ళ లెక్కలో లోకేష్ కు ప్రాధాన్యం లేనట్లా ? చంద్రబాబుతో ఉంటె సరిపోతుందా ? లోకేష్ ను పక్కనబడినట్లేనా అనే అభిప్రాయాలూ కలుగుతున్నాయి.