పాల్గొన్న MLA ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ విధాత, కరీంనగర్ బ్యూరో: హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నిరసిస్తూ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ళ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ మహ్మద్ ఇబ్రహీమ్ పై పోలీసుల అక్రమ కేసులను బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు. వీరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించిన […]
విధాత, కరీంనగర్ బ్యూరో: హుజురాబాద్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులను నిరసిస్తూ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో
ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
చెల్పూర్ గ్రామ సర్పంచ్ నేరేళ్ళ మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ మహ్మద్ ఇబ్రహీమ్ పై పోలీసుల
అక్రమ కేసులను బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.
వీరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించిన హుజురాబాద్ సి.ఐ బొల్లం రమేష్ పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని బిజెపి నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పొలీసులు బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
నిరసన దీక్ష, ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.