విధాత: బిజెపి ప్రజా, కార్మిక, వ్యతిరేక విధానాలు నశించాలని, కార్మికుల హక్కులను కాలరాసే 4లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఏప్రిల్ 05న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు కోరారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఛలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి […]
విధాత: బిజెపి ప్రజా, కార్మిక, వ్యతిరేక విధానాలు నశించాలని, కార్మికుల హక్కులను కాలరాసే 4లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఏప్రిల్ 05న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు కోరారు.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఛలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశంలోని సంపదను ఆదాని, అంబానీలకు అమ్ముతుందని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఈ దేశంలో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న 72 రకాల స్కీములను ప్రైవేటికరణ చేసే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.
దేశంలోని విద్య, వైద్యం, ఉపాధి, రంగాలను కార్పొరేట్ చేతుల్లో పెడుతుందన్నారు. దేశంలోనే పెట్టుబడుదారులు, కార్పొరేట్ల కోసం ఆదాని, అంబానీ ల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. దీనికి నిదర్శనమే దేశంలొని ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ చౌక ధరలకు అమ్మడం అని అన్నారు. విద్యుత్ సవరణ 2022 బిల్లును తీసుకొని రావడంతో వ్యవసాయ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఉపాధి హామీ పథకానికి తక్కువ నిధులు కేటాయించిందన్నారు.
వ్యవసాయ కార్మికులకు, పని దినాలు తగ్గిస్తూ, కూలీ రేట్లు తగ్గిస్తూ, కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుందని విమర్శించారు. కార్మికుల హక్కులు కాపాడుకోవడం కోసం ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీలో కార్మికులు, ప్రజలు, రైతులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, దూలం శ్రీనివాస్ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం బెల్లంపల్లి రీజినల్ అధ్యక్షులు, శివ, తిరుపతి కన్వెన్షన్స్ డ్రైవర్స్ అధ్యక్ష కార్యదర్శులు, సతీష్ కోశాధికారి, శ్రీనివాస్, రాజేష్, శ్రీకాంత్, నితీష్, రాజేందర్, హుసేన్త దితరులు పాల్గొన్నారు.