కండువాల మార్పిడిపై ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లో కండువా మార్పిడి కామన్ అయ్యింది. నిన్నొక కండువా కప్పుకుంటే నేడొక రంగు కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు. కప్పేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరితో ఎందుకు ఇబ్బంది లే అన్నట్లు ఎవరు కండువా కప్పితే వారి కండువా కప్పుకునేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కసారి ఈ కండువాల మార్పిడి కిరికిరికి దారి తీస్తోంది. రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య పోటా పోటీకి దారి తీస్తుంది. ఇదే […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లో కండువా మార్పిడి కామన్ అయ్యింది. నిన్నొక కండువా కప్పుకుంటే నేడొక రంగు కండువా కప్పుకునేందుకు సిద్ధపడుతున్నారు. కప్పేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరితో ఎందుకు ఇబ్బంది లే అన్నట్లు ఎవరు కండువా కప్పితే వారి కండువా కప్పుకునేందుకు మరికొందరు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కసారి ఈ కండువాల మార్పిడి కిరికిరికి దారి తీస్తోంది. రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య పోటా పోటీకి దారి తీస్తుంది. ఇదే పరిస్థితి వరంగల్ తూర్పులో నెలకొంది.
వరంగల్ అబ్బనికుంట ప్రాంతానికి చెందిన బొంత సంతోష్ అనే యువకుడు బిజెపిలో పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. సంతోష్కు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పారు.
ఏమైందో గాని మంగళవారం సంతోష్ తిరిగి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తనను బలవంతంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారంటూ చెప్పారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ నా తమ్ముళ్లు నమ్మకానికి నిలువెత్తు ఆనవాళ్లు, అమ్ముడు పోవడానికి, బెదిరింపులకు భయపడడానికి నీ వెంట తిరిగే మనుషుల్లా కాదు అంటూ ఎమ్మెల్యేను హెచ్చరించారు. సంతోష్కు బీజేపి కండువా కప్పారు. ఏ బీజేపీ కార్యకర్త జోలికి వచ్చినా నేనున్నానంటూ బి.ఆర్.ఎస్ నాయకులను ప్రదీప్ రావు హెచ్చరించారు. దీనిపై ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.