K. Vishwanath | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యముగా మలిచిన అరుదైన దర్శకుడు కె. విశ్వనాథ్ అని సీఎం అన్నారు. గతంలో ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికెళ్ళి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ […]
K. Vishwanath | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కళాతపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యముగా మలిచిన అరుదైన దర్శకుడు కె. విశ్వనాథ్ అని సీఎం అన్నారు.
గతంలో ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికెళ్ళి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని కేసీఆర్ పేర్కొన్నారు.
సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్ అని కేసీఆర్ తెలిపారు. దాదా సాహెబ్ ఫాల్కే , రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికి తురాయిగా నిలిచాయన్నారు. తెలుగు సినిమా వున్నన్ని రోజులు కే విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.
కవి పండితులకు జనన మరణాల భయం వుండదని, వారి కీర్తి అజరామరం అని.. జయన్తి తే సుకృతినో ..రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయమ్..అనే వాక్కు విశ్వనాథ్కు వర్తిస్తుందన్నారు సీఎం. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.