గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ శుక్రవారం రాత్రి రహస్యంగా గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు
విధాత, హైదరాబాద్: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న టాలీవుడ్ డైరక్టర్ క్రిష్ శుక్రవారం రాత్రి రహస్యంగా గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు క్రిష్కు నోటీస్లివ్వగా తాను ముంబైలో ఉన్నానని, సోమవారం విచారణకు వస్తానని చెప్పడం..ఇంతలో ఆయన పరారీలో ఉన్నారని ప్రచారం జరగడం…హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం వంటి పరిణామాల మధ్య క్రిష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.
క్రిష్ను 4గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు ఆయన డ్రగ్ తీసుకున్నారా లేదా అనే విషయం తేల్చేందుకు బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు. తాను డ్రగ్ తీసుకోలేదని, పోలీసులు నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని క్రిష్ తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కోన్నారు.
ఈ కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వివేకానంద తన వాంగ్మూలంలో క్రిష్ కూడా డ్రగ్ తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా సమాచారం. ఇప్పుడు క్రిష్ శాంపిల్స్ను పరీక్షలకు పంపిన నేపథ్యంలో అతను డ్రగ్ తీసుకున్నట్లుగా తేలితే అరెస్టు చేసే అవకాశముంది.
13కు చేరిన నిందితుల సంఖ్య
డ్రగ్ కేసులో నిందితుల సంఖ్య పెడ్లర్ మీర్జా వాహిద్ వాంగ్మూలం అనంతరం మరో ముగ్గురు పెడ్లర్ల కోసం గాలిస్తున్న పోలీసులు వారి పేర్లను నిందితులుగా చేర్చారు. ఏ13వ నిందితుడు అబ్ధుల్ రెహమాన్ స్నాప్ చాట్ ద్వారా మీర్జా వాహిద్కు పరిచయం అయ్యాడు. రెండు గ్రాములకు 30 వేలను గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.
ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కొకైన్ అందచేసినట్లుగా మీర్జా వాహిద్ తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ప్రధాన నిందితుడు వివేకానంద ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్స్ అందజేసినట్లుగా పెడ్లర్ మీర్జా వాహిద్ తెలిపాడు. ఫిబ్రవరిలో పదిసార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు వాహద్ రిమాండ్ రిపోర్టులో పేర్కోన్న పోలీసులు మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరు ప్రస్తావించారు.
అటు డ్రగ్ పార్టీలు జరుగుతున్నాయని తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో హోటల్ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాడిసన్ బ్లూ హోటల్లోని 1200, 1204రూమ్లు డ్రగ్ పార్టీల అడ్డాగా ఉన్నాయని పోలీసులు పేర్కోన్నారు.