Childrens ప్రపంచబ్యాంక్, యునిసెఫ్ తాజా నివేదికల్లో వెల్లడి కటిక దారిద్య్రంతో ఉన్న ప్రతి ఇద్దరిలో ఒక చిన్నారి ఆకలితో అలమటించే పిల్లల సంఖ్య గతం కన్నాపెరిగింది న్యూఢిల్లీ : దేశంలో అతి దారుణమైన ఆకలితో మలమలమాడుతూ అలమటిస్తున్న పిల్లల జనాభా 5.2 కోట్లకు చేరుకొందని ప్రపంచబ్యాంక్, యునిసెఫ్ ఒక నివేదికలో వెల్లడించాయి. పిల్లల ఆకలి, దారిద్ర్యం విషయంలో ఇది గతంలో కంటే పెరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే నిజాలని పేర్కొన్నాయి. జీడీపీ పెరిగిందని, ప్రపంచంలో మూడవ […]
Childrens
న్యూఢిల్లీ : దేశంలో అతి దారుణమైన ఆకలితో మలమలమాడుతూ అలమటిస్తున్న పిల్లల జనాభా 5.2 కోట్లకు చేరుకొందని ప్రపంచబ్యాంక్, యునిసెఫ్ ఒక నివేదికలో వెల్లడించాయి. పిల్లల ఆకలి, దారిద్ర్యం విషయంలో ఇది గతంలో కంటే పెరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే నిజాలని పేర్కొన్నాయి. జీడీపీ పెరిగిందని, ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించే వైపు దేశం అభివృధ్ధి చెందుతున్నదని కేంద్ర గొప్పలు చెప్పుకొంటున్న నేపథ్యంలో వాస్తవ స్థితిని ఈ నివేదిక బయటపెట్టింది.
నివేదికలోని అంశాల్లోకి వెళితే.. 11.5 శాతం మంది పిల్లలు హీనమైన దారిద్ర్యంతో పొట్టగడిచే కుటుంబాల్లో వున్నారు. భరించలేని పేదరికంతో ఆకలితో అలమటించే వీరి సంఖ్య కనీసం 5.2 కోట్లు వుంటుందని అంచనా. అత్యంత చింతించదగ్గ విషయమేమంటే ఐదు సంవత్సరాల కంటే చిన్న వయస్సున్న వారి పేదరికం ఇంకా చాలా ఎక్కువట. వారు వెల్లడించిన రిపోర్టు ప్రకారం నిత్య దరిద్ర్యంలోనివసిస్తున్న కుటుంబాల్లోని 18.3 శాతం అంటే 9.9 కోట్లు పిల్లలు ఐదు లేదా ఐదు సంవత్సరాల కంటే చిన్నవాళ్లు. ఇది చిన్నపిల్లల పట్ల ఘోరమైన అపరాధంగా భావించవచ్చు.
ప్రపంచంలో కడు పేదరికంలో బతుకుతున్నవాళ్లల్లో సగానికన్నా ఎక్కువ మంది 52.5 శాతం మంది పిల్లలే. ప్రపంచంలో దారిద్య్రం వేగంగా పెరుగుతున్నది. ప్రతి రోజు కనీసం 2.15 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో బతికే జనాభాలో చిన్న పిల్లల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. అది 2013లో 47.3 శాతం కాగా, 2022లో 52.5 శాతానికి పెరిగింది. కాలానుగుణంగా ప్రపంచ పేదరికం పిల్లల్లో బాగా వృధ్ధి చెందుతున్నది, పిల్లల్లో పేదరికాన్ని ప్రామాణికంగా లెక్కించడానికి గానూ 2.15 డాలర్లను గరీబు రేఖగా చూశారు.
సరైన పెట్టుబడులు పద్ధతి ప్రకారం, దృఢ సంకల్పంతో వినియోగించటం ద్వారా హేయమైన పేదరికం నుండి పిల్లలను బయటకు తీసుకరావడం సాధ్యమని యూనిసెఫ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కైథరీన్ రసేల్ తెలియజేశారు. ప్రపంచబ్యాంకులో పేదరికం, సమానతకు సంబంధించిన డైరెక్టర్ ఈస్ ఫిలిఫ్ లొఫేజ్ కాల్వా మాట్లాడుతూ, నాణ్యమైన విద్య, ఉత్తమ పోషకాహారం, ఆరోగ్యం, సామాజికపాత్ర, రక్షణ, సమాన అవకాశాలను కల్పించడం ద్వారా పిల్లల్లో పేదరికాన్ని కొంతమేరకు రూపుమాపవచ్చు అని వివరించారు.