Gwalior | ఓ మహిళపై కొందరు దుండగులు లైంగికదాడికి యత్నించారు. ప్రతిఘటించడంతో.. కదులుతున్న రైలు నుంచి ఆమెతో పాటు బంధువును తోసేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన ఓ మహిళ తన బంధువుతో కలిసి సూరత్కు వెళ్లేందుకు సూరత్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. ఇక గ్వాలియర్ రాగానే ఆమెపై కన్నేసిన కొంత మంది కామాంధులు.. లైంగికంగా వేధించారు. అడ్డుకోబోయిన తన బంధువును […]
Gwalior |
ఓ మహిళపై కొందరు దుండగులు లైంగికదాడికి యత్నించారు. ప్రతిఘటించడంతో.. కదులుతున్న రైలు నుంచి ఆమెతో పాటు బంధువును తోసేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన ఓ మహిళ తన బంధువుతో కలిసి సూరత్కు వెళ్లేందుకు సూరత్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కింది. ఇక గ్వాలియర్ రాగానే ఆమెపై కన్నేసిన కొంత మంది కామాంధులు.. లైంగికంగా వేధించారు.
అడ్డుకోబోయిన తన బంధువును దుండగులు దారుణంగా కొట్టారు. ఆ సీటు నుంచి మరో సీట్లోకి వెళ్లేందుకు యత్నించిన ఆమెను మళ్లీ అడ్డుకున్నారు. ఆ తర్వాత చీర లాగేయడంతో ఆమె అర్ధనగ్నంగా ఉండిపోయింది. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఫోటోలు కూడా తీశారు.
అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెతో పాటు బంధువును కదులుతున్న రైల్లో నుంచి బయటకు తోసేశారు. ఆ రాత్రంతా గాయాలతో బాధపడుతూ రైలు పట్టాలపైనే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత స్థానికులు వారిని గుర్తించి, ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.