Hydrabad విధాత, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్ను నిర్వహిస్తోన్న ఈ-సెట్రిక్ ప్రగతి భవన్ పక్కనే ఉందంటూ శుక్రవారం కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి. ఇటీవల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ కారణంగా రైతుల భూ యాజమాన్య హక్కులు ఓ ప్రైవేటు వ్యక్తి చేతిలోకి వెళ్లాయని, అతనికి ప్రగతి భవన్ పెద్దలతో సంబంధం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాజాగా ఈ సెట్రిక్ ఆఫీస్ ప్రగతి […]
Hydrabad
విధాత, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్ను నిర్వహిస్తోన్న ఈ-సెట్రిక్ ప్రగతి భవన్ పక్కనే ఉందంటూ శుక్రవారం కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి.
ఇటీవల రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ కారణంగా రైతుల భూ యాజమాన్య హక్కులు ఓ ప్రైవేటు వ్యక్తి చేతిలోకి వెళ్లాయని, అతనికి ప్రగతి భవన్ పెద్దలతో సంబంధం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాజాగా ఈ సెట్రిక్ ఆఫీస్ ప్రగతి భవన్ పక్కనే ఉందని, ఇదిగో అడ్రస్ అంటూ సోషల్ మీడియాలో పలువురు పెట్టిన పోస్టులు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇందులో నిజమెంత అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.