VEERASIMHA REDDY, VARALAKSHMI SARATH KUMAR సినిమా పరిశ్రమలో స్టార్ డమ్ని మించింది లేదు. తమ అభిమాన హీరోలని ప్రేక్షకులు దేవుడితో సమానంగా చూసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో కృష్ణ, నాగార్జున నటించిన వారసుడు చిత్రం వచ్చింది. ఓ సన్నివేశంలో నాగార్జున కృష్ణ కాలర్ పట్టుకునే సీన్ పలు వివాదాల కారణమైంది. మా హీరోనిని ఇలా చూపిస్తారా అంటూ అభిమానులు ఒక రేంజ్లో రెచ్చిపోయారు. కథ ప్రకారం, కథానుసారం కృష్ణని నాగార్జున అవమానించాలి. కానీ […]
VEERASIMHA REDDY, VARALAKSHMI SARATH KUMAR
సినిమా పరిశ్రమలో స్టార్ డమ్ని మించింది లేదు. తమ అభిమాన హీరోలని ప్రేక్షకులు దేవుడితో సమానంగా చూసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో కృష్ణ, నాగార్జున నటించిన వారసుడు చిత్రం వచ్చింది. ఓ సన్నివేశంలో నాగార్జున కృష్ణ కాలర్ పట్టుకునే సీన్ పలు వివాదాల కారణమైంది. మా హీరోనిని ఇలా చూపిస్తారా అంటూ అభిమానులు ఒక రేంజ్లో రెచ్చిపోయారు. కథ ప్రకారం, కథానుసారం కృష్ణని నాగార్జున అవమానించాలి. కానీ దానిని కృష్ణ అభిమానులు సహించ లేకపోయారు.
ఇక చంద్రలేఖ అనే చిత్రంలో నాగార్జున తాను తప్పు చేశానన్న భావనతో హీరోయిన్ రమ్యకృష్ణ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆమె కాళ్ళను తాకుతాడు. దీనిపై కూడా పెద్ద రాద్ధాంతమే జరిగింది. సినీ ప్రేక్షకులు, అభిమానులు సినిమాని సినిమాగానే చూడాలి అనే అవగాహన ఉండడం లేదు. ఇక విషయానికి వస్తే ఒకప్పుడు తమిళనాట హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేడీ విలన్గా బిజీ అయింది. కీలక పాత్రలతో పాటు విలన్ రోల్స్ చేస్తోంది.
వరలక్ష్మి తెలుగులో ఎక్కువగా విలన్ పాత్రలే పోషిస్తుంది. నెగటివ్ షేడ్స్ లో ఆమె నటించిన చిత్రాలలోని పాత్రలను మనం అంత త్వరగా మర్చిపోలేం. వీరసింహారెడ్డిలో బాలయ్య చెల్లి భానుమతిగా నెగెటివ్ షేడ్స్ పాత్రను పోషించింది. ఇంటర్వెల్ సీన్లో వీర సింహారెడ్డిని పొడిచి చంపేసే సీన్ ఉంటుంది. ఈ సీన్ తోనే వరలక్ష్మి బాగా హైలైట్ అయింది.
అయితే ఆ సన్నివేశం చేసేటప్పుడు తాను భయాందోళనకు గురయ్యానని, అది చూశాక బాలయ్య అభిమానులు ఎక్కడా తనను చంపుతారోనని భయపడ్డానని వరలక్ష్మి కుండ బద్దలు కొట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ బాలయ్య ని పొడిచి చంపేసే సీన్ చేస్తున్నప్పుడు చాలా భయపడిపోయాను.
బాలయ్య అభిమానులు నాపై పగతో ఎక్కడ నన్ను చంపుతారని ఆందోళనకు గురయ్యా. అయితే బాలయ్య నాలో ధైర్యం నింపాడు. ఆ సన్నివేశాన్ని అభిమానులు నెగటివ్గా తీసుకోరని బాగా రిసీవ్ చేసుకుంటారని ధైర్యం చెప్పారు. అలా మీరందరూ ఈ సీనుని బాగా రిసీవ్ చేసుకున్నందుకు థాంక్స్ అని చెప్పుకొచ్చింది.
రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ చూసి నేను షాక్ కి గురయ్యాను. ఆ ఫైట్ సీన్స్ చూస్తూ నేను కూడా జై బాలయ్య అంటూ అరిచాను. తమన్ బీజీఎం స్కోర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ప్రతి షాట్లోనూ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత నేను బాలయ్యకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. భానుమతి పాత్రను ఇంత గొప్పగా డిజైన్ చేసినందుకు దర్శకుడు గోపీచంద్కి ధన్యవాదాలు తెలిపింది.