Site icon vidhaatha

Liquor Scam | లిక్కర్ స్కామ్.. కవిత పిటిషన్ విచారణ వాయిదా

Liquor Scam |

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా దర్యాప్తు సంస్థల కార్యాలయంలో మహిళను విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత దాఖలు చేసిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఈడీకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

మహిళనైన తనను సాక్షిగా ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్ చేస్తు కవిత పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ ధర్మాసనం ఈడీకి కౌంటర్ దాఖలు చేయాలని, రెండు వారాల్లో కవితకు రిజైన్డర్ దాఖలు చేయాలని సూచించింది.

అనంతరం కేసు విచారణను ఆరువారాలు వాయిదా వేసింది. కవిత తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్‌, ముకుల్ రోహత్గీలు తమ వాదనలు వినిపించారు.

Exit mobile version