Medak | ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు.. పోరాటాలు ఉధృతం: కొండల్ రెడ్డి

Medak | మెదక్ లో టీచర్ల ఆందోళన విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు పోరాటాలు ఉదృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు, టీపీ టీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి. కొండల్ రెడ్డి తెలిపారు. శనివారం మెదక్‌లో తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సీపీసీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు […]

  • Publish Date - August 12, 2023 / 12:42 AM IST

Medak |

  • మెదక్ లో టీచర్ల ఆందోళన

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకు పోరాటాలు ఉదృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు, టీపీ టీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బి. కొండల్ రెడ్డి తెలిపారు. శనివారం మెదక్‌లో తమ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సీపీసీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జూలై 1 నుంచి ఐఆర్ ప్రకటించి, నిర్దిష్ట కాల పరిమితితో పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్‌ చేశారు. 317 జీ.ఓ.బాధితులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలనీ డిమాండ్ చేశారు. రూ 398 స్పెషల్ టీచర్ సర్వీసుకు నోషనల్ ఇంక్రిమెంట్ లు ఇవ్వాలన్నారు.

టీచర్ల పదోన్నతులు, బదిలీలు, నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయున్ని కేటాయించాలన్నారు. టీపీ టీఎఫ్‌ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగయ్య,వెంకట్రామిరెడ్డిలు మాట్లాడుతు పండిట్, పిఐటీల అప్‌ గ్రేడేషన్‌ చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం హామీ మేరకు 5571 పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అన్ని పాఠశాలలకు మనఊరు మనబడి వర్తింపజేయాలని, పథకానికి నిధులు కేటాయించి సత్వరమే మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నగదు రహిత అపరిమిత ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా గుడ్లు, మధ్యాహ్న భోజన యూనిట్ ధర పెంచాలన్నారు.

ప్రతీ నెల బిల్లులు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రమని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల వేతనాలు ఒకటో తారీఖునే ఇవ్వలని డిమాండ్‌ చేశారు. మెడికల్, సరెండర్ వంటి ఆర్థిక బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పద్మా రావ్, టిపిటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు యాదగిరి ఉపాద్యాయ దర్శిని ఎడిటర్ శశిధర్ రెడ్డి యూఎస్పిసి నాయకులు బింలా నాయక్, రవీందర్ రెడ్డి, పిండి నాగరాజు, సురేందర్ నాగుల్ మీరా,శేకర్,యాదగిరి,గోపాల్, రాజయ్య, దేవీ సింగ్, హీరా లాల్, శ్రీనివాస్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, శీతల సింగ్,శేఖర్, ప్రేమ్ కుమార్, బాల పోచయ్య, నరసింహా రావు, సత్య నారాయణ తదతరులు పాల్గోన్నారు.అంతకు ముందు ఉపాద్యాయులు బారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.మెదక్ నర్సాపూర్ x రోడ్ లో సభ నిర్వహించారు.

Latest News