Journalists | జర్నలిస్ట్ల కుటుంబాలకు మీడియా అకాడమీ గుర్తింపు కార్డు విడుదల విధాత, హైదరాబాద్: జర్నలిస్టులకు వారి కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనారోగ్యం బారిన జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఎల్ఓసీ రావడానికి పూర్తిగా సహకారం అందిస్తానని అన్నారు. గురువారం మీడియా అకాడమీలో 104 జర్నలిస్ట్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా […]
Journalists |
జర్నలిస్ట్ల కుటుంబాలకు మీడియా అకాడమీ గుర్తింపు కార్డు విడుదల
విధాత, హైదరాబాద్: జర్నలిస్టులకు వారి కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనారోగ్యం బారిన జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఎల్ఓసీ రావడానికి పూర్తిగా సహకారం అందిస్తానని అన్నారు.
గురువారం మీడియా అకాడమీలో 104 జర్నలిస్ట్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి జర్నలిస్టుల కుటుంబాల కోసం, అకాడమీ చేసిన గుర్తింపు కార్డును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమీ సందర్శించి ఐదు గంటలు నిశితంగా చర్చించి, కార్యక్రమాలు ఎలా ఉండాలో, దిశా నిర్దేశం చేశారన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని సూచించగా, వెంటనే 10 కోట్లు విడుదల చేశారన్నారు.
ఈ 104 మందితో కలిపి 600 పైగా జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం అందించిందన్నారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్ట్ల కోసం ఆరోగ్యశ్రీ పథకం క్రింద 3.5 కోట్లు, సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా 2.5 కోట్లు సహాయం అందించిందని అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుండి మరో రూ. 10 నుంచి రూ. 15 కోట్లు కేటాయించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే జనరల్ సెక్రెటరీ మారుతీ సాగర్, సమాచార శాఖ అదనపు సంచాలకులు, కిషోర్ బాబు, మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, మేనేజర్ పీసీ వెంకటేశం, జర్నలిస్టు నాయకులు పాల్గొన్నారు.