Nizamabad | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్న కాళేశ్వరం జలాలు

Nizamabad పూజ‌లు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి త‌ర‌లి వ‌చ్చిన రైతులు విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. పూజ‌ల‌కు రైతులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల క‌ల నెర‌వేరిన రోజు ఇది అని అన్నారు. ఎప్పటికైనా.. తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. […]

Nizamabad | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్న కాళేశ్వరం జలాలు

Nizamabad

  • పూజ‌లు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
  • త‌ర‌లి వ‌చ్చిన రైతులు

విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. పూజ‌ల‌కు రైతులు అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల క‌ల నెర‌వేరిన రోజు ఇది అని అన్నారు.

ఎప్పటికైనా.. తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కలలో కూడా ఊహించలేదు గోదారమ్మ ఎదురు ఎక్కుతదని అంటూ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌య్యారు. సీఎం కేసీఆర్‌కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. నా హయాంలో ఎస్సారెస్పీ పునర్జీవం పనులు పూర్తి అవటం నా అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు.

2001లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మర‌ణీయ స్థానం సంపాదించారు సీఎం కేసీఆర్ అని అన్నారు. 300 కిలో మీటర్ లు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించడం చాలా గొప్ప విషయమ‌న్నారు. ఇక వర్షాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడువునా రైతులకు సాగు నీరు అందించే వీలుంద‌న్నారు.

కాళేశ్వరంతో కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ప్రతి పక్షాలు బురద జల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. 90 వేల కోట్లతో పనులు జరిగితే లక్ష కోట్ల అవినీతి జరిగింది అనటం హాస్యాస్పదమ‌న్నారు.

ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని స‌వాల్ విసిరారు.
కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ నాడు తో పాటు యావత్ దేశ రైతులు కొనియాడుతున్నారన్నారు. రైతులు ప్రతి పక్షాల ఆరోపన‌లను తిప్పి కొట్టాలని పిలుపునిస్తున్నాన‌న్నారు.