Nischalananda Saraswati | కుల వ్యవస్థను సృష్టించింది మతగురువులు, పురోహితులదే తప్ప భగవంతుడు సృష్టించనవి కావంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పూరీ శంకాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతీ మండిపడ్డారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సమావేశంలో స్వామి నిశ్చలానంద సరస్వతి మాట్లాడుతూ వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులకు వరంలాంటిదన్నారు. ఆర్ఎస్ఎస్పై మండిపడ్డ ఆయన.. సనాతన హిందువులందరి పూర్వీకులు బ్రాహ్మణులేనన్నారు. మొదటి బ్రాహ్మణుడి పేరు బ్రహ్మ అని, అవసరమైతే గ్రంథాలయాలను అధ్యయనం చేయాలన్నారు. […]
Nischalananda Saraswati | కుల వ్యవస్థను సృష్టించింది మతగురువులు, పురోహితులదే తప్ప భగవంతుడు సృష్టించనవి కావంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పూరీ శంకాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతీ మండిపడ్డారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక సమావేశంలో స్వామి నిశ్చలానంద సరస్వతి మాట్లాడుతూ వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులకు వరంలాంటిదన్నారు. ఆర్ఎస్ఎస్పై మండిపడ్డ ఆయన.. సనాతన హిందువులందరి పూర్వీకులు బ్రాహ్మణులేనన్నారు. మొదటి బ్రాహ్మణుడి పేరు బ్రహ్మ అని, అవసరమైతే గ్రంథాలయాలను అధ్యయనం చేయాలన్నారు.
ప్రపంచంలోని అన్ని శాస్త్రాలు, కళలు బ్రాహ్మణుల ద్వారా మాత్రమే వివరించబడ్డాయన్న ఆయన.. విద్య, రక్షణ, ఇతర సేవలు ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉండాలన్నారు. మనం సనాతన వ్యవస్థను అంగీకరించకపోతే.. అలాంటతప్పుడు ఏ వ్యవస్థ ఉండాలని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్కు సొంత గ్రంథం, పుస్తక జ్ఞానం లేదన్న నిశ్చలానంద వర్ణ వ్యవస్థ పండితులచే సృష్టించబడిందని, మార్ఖులచే కాదన్నారు. నేటికీ భారత్లో ప్రజలు బ్రాహ్మణుల వద్దకు సమస్యల పరిష్కారం కోసం వస్తారన్నారు. ప్రపంచం, ఐక్యరాజ్య సమితి అన్ని చిక్కులు మా వద్దకు రావడం వల్ల పరిష్కరించబడుతున్నాయని విలేకరులతో అన్నారు. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో వర్ణ వ్యవస్థ లేదని, అలాంటి దేశాల్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వంటి ప్రత్యామ్నాయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు.