Revanth Reddy కేసీఆర్ను కోసి కారం పెట్టినా తప్పు లేదు నిజనిర్థార కమిటీ వేస్తున్నాం: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విధాత: హైదరాబాద్ నగరానికి అణువిస్పోటనం కంటే ప్రమాదకరమైనది 111 జీవో (111GO) రద్దు అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్రిబుల్ వన్ జీవో రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఈ జీవో పరిధిలో 80శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. 111జీవో రద్దు […]
విధాత: హైదరాబాద్ నగరానికి అణువిస్పోటనం కంటే ప్రమాదకరమైనది 111 జీవో (111GO) రద్దు అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్రిబుల్ వన్ జీవో రద్దు వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. ఈ జీవో పరిధిలో 80శాతం భూములు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. 111జీవో రద్దు దుర్మార్గపు నిర్ణయమన్నారు. ఈ జీవోను రద్దు చేసిన కేసీఆర్ ను కోసి కారం పెట్టినా తప్పులేదన్నారు.
ఈ జీవో రద్దు వెనుక లక్షల కోట్ల కుంభకోణం దాగుందన్నారు. బందిపోట్లను, దావూద్ నైనా క్షమించవచ్చు, కానీ కేసీఆర్, కేటీఆర్లను క్షమించ కూడదన్నారు. మొత్తం భూములు పేదల నుంచి కొనుగులు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారన్నారు. కేసీఆర్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారన్నారు.
ఈ విధ్వంసం వెనుక భారీ భూ కుంభకోణం ఉందన్న రేవంత్.. కాంగ్రెస్ నిజ నిర్దారణ కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. ఈ కమిటీ 2019 నుంచి ఇప్పటి వరకు బీఆర్ ఎస్ నేతలు కొన్న భూముల వివరాలు సేకరిస్తుందన్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ లావాదేవీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బినామీ యాక్టును కేంద్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పోరాటం ఫలితంగానే కృష్ణా, గోదావరి జలాలు తరలింపు జరిగిందని రేవంత్ అన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను విధ్వంసం చేసే హక్కు కేసీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు పైప్ లైన్ ఇస్తాననడం వెనక కుట్ర దాగుందన్నారు. కేసీఆర్ ఈ విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
బీఆర్ ఎస్ బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందమన్నారు. సోమేశ్ కుమార్,అరవింద్ కుమార్ ఈ విధ్వంసానికి కారణమన్నారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, కేసీఆర్, కేటీఆర్లను అమరవీరుల స్థూపం వద్ద కట్టేసి కొట్టినా తప్పు లేదన్నారు.
లేక్ సిటీ హైదరాబాద్ లో చెరువులే లేకుండా పోయాయని రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో వరదల విధ్వంసం పొంచి ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ లేకుండా లక్షా 30వేల ఎకరాలకు అనుమతులు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. 111జీవో పరిధిలోని గ్రామాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? అని అడిగారు.
ఈ విధ్వంసానికి అరవింద్ కుమార్, సోమేశ్, కేసీఆర్, కేటీఆర్ దుష్ట చతుష్టయం కారణమని రేవంత్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి జంట నగరాలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నావెంటనే ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.
‘‘బండి సంజయ్ రంకెలేయడం కాదు.. మోకాలుకు బోడి గుండుకు ముడి పెట్టడం కాదు.’’చిత్తశుద్ధి ఉంటే ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ దుష్టచతుష్టయంపై కేంద్ర ప్రభుత్వం చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.