Site icon vidhaatha

Warangal: KMC హాస్టళ్ల‌ మరమ్మతుకు రూ.2 కోట్లు మంజూరు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ మరమ్మతులకు రూ.2 కోట్ల 5 లక్షల 50 వేలు మంజూరు చేయించిన రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ బుధవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిధులను కాకతీయ మెడికల్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్, జూనియర్ డాక్టర్స్ హాస్టల్ మరమ్మతులతో పాటు పీ జీ హాస్టల్ ఫర్నీచర్ కోసం వినియోగించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందన్నారు. కాగా, పనులు నాణ్యంగా జరిగేలా చూసి, నిధులను సద్వినియోగం చేయాలని మంత్రి సూచించారు.

Exit mobile version